మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

27 Apr, 2016 15:18 IST|Sakshi

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో కట్టుకున్న భార్యను హతమార్చాడు. దీంతో నాలుగేళ్ల చిన్నారి అనాధలా మారింది. తల్లి లేని ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుండటం గమనించిన బంధువులు ఆ చిన్నారిని తల్లి మృతదేహంతో సహా తీసుకెళ్లి తండ్రి ఇంటి ముందు ఆందోళన చేశారు. వరంగల్ జిల్లా మల్కాపురానికి చెందిన ఓ జంట నగరంలో నివాసముంటున్నారు.

 

ఈ క్రమంలో మద్యానికి బానిసైన భర్త భార్యను హతమార్చి పరారాయ్యాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు నాలుగేళ్ల వర్షితను మల్కాపురం తీసుకెళ్లి అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

>
మరిన్ని వార్తలు