ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి

7 May, 2016 12:20 IST|Sakshi

మలక్‌పేట: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. లక్ష్మి అనే మహిళ తమ షాపునకు సంబంధించి వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు గాను సీనియర్ అసిస్టెంట్ నరహరి రూ.2,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు