సండ్ర పుష్కర స్నానానికి కోర్టు అనుమతి

23 Jul, 2015 21:08 IST|Sakshi
సండ్ర పుష్కర స్నానానికి కోర్టు అనుమతి

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పుష్కర స్నానం ఆచరించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతించింది. సండ్ర కోరుకున్న చోట పుష్కర స్నానం చేసేందుకు న్యాయమూర్తి లక్ష్మీపతి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సండ్రకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో నియోజకవర్గం వదలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో పుష్కర స్నానానికి అనుమతించాలని కోరుతూ సండ్ర ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు