విమానం అత్యవసర ల్యాండింగ్

1 Aug, 2015 21:27 IST|Sakshi

శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేసింది. వివరాలు.. శనివారం సాయంత్రం 6.53 గంటలకు శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా-514 విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఏటీసీ అనుమతితో తిరిగి 7.11 గంటలకు విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ నిపుణులు విమానానికి మరమ్మతులు చేస్తున్నారు. విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు.

మరిన్ని వార్తలు