'ఎయిర్ కోస్టా' ప్రయాణికుల పడిగాపులు

21 Jun, 2016 11:28 IST|Sakshi

శంషాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ కోస్టా విమానం మంగళవారం ఉదయం 7 గంటలకు శంషాబాద్ నుంచి విశాఖ కు వెళ్లాల్సి ఉంది. అయితే విశాఖలో వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో విమానాన్ని ఎయిర్ పోర్టు అధికారులు నిలిపివేశారు. దీంతో  నాలుగు గంటలుగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. వాతావరణం అనుకూలించిన వెంటనే సర్వీసును పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు