బాధితులకు న్యాయం చేస్తాం: అక్షయ గోల్డ్

19 Sep, 2016 18:25 IST|Sakshi

హైదరాబాద్: బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐడీ కోర్టుకు అక్షయ గోల్డ్ యాజమాన్యం తెలిపింది. ఎలాంటి న్యాయం చేస్తారో రాతపూర్వకంగా వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలని కోర్టు సూచించింది.

కాగా, డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు అక్షయ్ గోల్డ్ సంస్థ ఎక్కడ పెట్టుబడి పెట్టిందో తేల్చాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. బ్యాంకు నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30 వరకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు