ఎంసెట్ స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్

19 Aug, 2016 20:19 IST|Sakshi
ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన అశ్వినీకుమార్ థోమర్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. అశ్వినీకుమార్ ఢిల్లీలో ఆకృతి కన్సల్టెన్సీ పేరిట కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని... ఎంసెట్-2 లీకేజీ సూత్రధారులతో సంబంధాలు పెట్టుకొని ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేక’ శిక్షణ ఇప్పించాడని సీఐడీ విచారణలో వెలుగు చూసింది. ఆ ఇద్దరిని ఎంసెట్-2 పరీక్షకు రెండు రోజుల ముందు బెంగళూరులో నిర్వహించిన క్యాంపుకు తరలించి శిక్షణ ఇప్పించాడని తేలింది. ఈ నేపథ్యంలో అశ్వినీకుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం వెల్లడించారు. ఆయన ద్వారా సూత్రధారులను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 
 
మరిన్ని వార్తలు