అగ్రిగోల్డ్‌ కేసు.. సీఐడీ అదుపులో మరో ముగ్గురు

18 Feb, 2016 16:27 IST|Sakshi

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కేసులో మరో ముగ్గుర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. గురువారం ముగ్గురు నిందితులను ఏలూరు కోర్టులో సీఐడి అధికారులు హాజరు పర్చారు. నిందితులకు అక్కడి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అయితే నిందితులను 4 రోజుల కస్టడీకి సీఐడీ కోరినట్టు తెలిసింది.

అరెస్టైన వారిలో అగ్రిగోల్డ్‌ ఫార్మా వైఎస్‌ ఛైర్మన్‌ సదాశివవరప్రసాద్‌, అగ్రిగోల్డ్‌ కనస్ట్రక్షన్స్‌ ఎండీ రామచంద్రరావు, డ్రీమ్‌ల్యాండ్‌ వెంచర్స్‌ ఎండీ అహ్మద్‌ఖాన్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు