-

ఎమ్మెల్యే రోజాకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

2 Apr, 2016 17:08 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల సంఘం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు శనివారం నోటీసులు జారీచేసింది. ఈ నెల 6వ తేదీన రోజాను సభా హక్కుల సంఘం ముందు హజరుకావాలని సూచించింది. 

ప్రివిలేజ్ కమిటీ ఎప్పుడు పిలిచినా ఆ కమిటీ ముందు హాజరవుతానని రోజా ఇప్పటికే తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రివిలేజ్ కమిటీని గౌరవిస్తానన్నారు. గతేడాది డిసెంబర్ 22న అసెంబ్లీ జీరో అవర్‌లో తలెత్తిన పరిణామాలపై ఎమ్మెల్యే రోజా ఏడాది పాటు స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు