హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలేదంటూ విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ విద్యార్థులు వైఎస్ జగన్ను కలిశారు.
విద్యార్థులు తమ సమస్యలను వైఎస్ జగన్కు విన్నవించారు. ఫీజులు చెల్లించకపోవడంతో పరీక్షలు రాసేందుకు హైదరాబాద్లోని కాలేజీలు అనుమతించడంలేదని చెప్పారు. విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.