రూ.5 భోజనం చేసిన వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే

12 Apr, 2017 14:58 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో అమలులో ఉన్న రూ.5 భోజనాన్ని వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయన బుధవారం నగరంలోని జీహెచ్‌ఎంసీ ఆధ్వర‍్యంలో హరే కృష్ణ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న భోజన కేంద్రానికి వెళ్లారు. మండే ఎండలో క్యూ లైన్‌ల్‌ నిల్చుని భోజనం సదుపాయాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడే బోజనం చేశారు.
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ కార్యక్రమం బాగుందని, తన నియోజక వర్గం మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమం పెట్టి సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం క్షేత్ర స్థాయిలో రూ. 5 భోజన పథకాన్ని స్యయంగా పరిశీలిస్తున్నట్టు ఆర్కే తెలిపారు.
మరిన్ని వార్తలు