గ్రూప్‌–3 పోస్టుల భర్తీపై నేడు ప్రకటన

31 Dec, 2016 07:55 IST|Sakshi
గ్రూప్‌–3 పోస్టుల భర్తీపై నేడు ప్రకటన

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రూప్‌–3 కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శనివారం ప్రకటన విడుదల చేయనుంది. కమిషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయభాస్కర్, ఇతర సభ్యులు శనివారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. అనంతరం ఏపీపీఎస్సీ గ్రూప్‌–3 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మొత్తం 1,055 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. 

మరిన్ని వార్తలు