కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు

27 Aug, 2016 12:48 IST|Sakshi
కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు

హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలియజేశారు. ఈ మూడు ప్రాజెక్టులు 2019నాటికి పూర్తవుతాయని తాను ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అదే సమయంలో గోదావరి నది నీళ్లు ఉపయోగించుకునేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలేవీ ఇప్పటి వరకు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి చెప్పింది సత్యం అని అన్నారు. అలాగే, ప్రతీది రాజకీయం చేయడం తగదని, తెలంగాణకు నీటి పారుదల, అభివృద్ధి అనేది చాలా ముఖ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.

మరిన్ని వార్తలు