ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’

12 Aug, 2016 03:10 IST|Sakshi
ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఆ కోర్టు తోసిపుచ్చింది. బుధవారం రివ్యూ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రా తో కూడిన ధర్మాసనం పిటిషన్‌లో పునఃసమీక్షించాల్సిన అంశాలేవీ లేవంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఉత్తర్వులను సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది.

మరిన్ని వార్తలు