ఏటీఎం దోపిడీ కేసు నిందితుడి అరెస్టు

21 May, 2015 18:11 IST|Sakshi

యూసుఫ్గూడలోని ఏటీఎం సెంటర్లో రివాల్వర్తో బెదిరించి యువతి నుంచి సొత్తు దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్లిన యువతిని నిందితుడు తన వద్ద ఉన్న రివాల్వర్తో బెదిరించి.. గాల్లోకి కాల్పులు కూడా జరిపి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్, ఏటీఎం కార్డు, నగదు తదితరాలను దోచుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఒక్క రోజులోనే నిందితుడిని పట్టుకోగలిగారు. అతడివద్ద నుంచి తుపాకి, మూడు బుల్లెట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు.

మరిన్ని వార్తలు