సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నాయ కులు విమోచన యాత్ర పేరిట ప్రభుత్వంపై విమ ర్శలు గుప్పించడం దారుణమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలను వారి అధినాయకత్వం పట్టిం చుకోవడం లేదని, కేవలం తమ ఉనికి కోసమే విమోచన యాత్రలు చేస్తున్నా రని విమర్శించారు.
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం విలేక రులతో ఆయన మాట్లాడారు. తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని, ఉండి ఉంటే రూ.లక్ష కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పించి ఉండేవారని, హైకోర్టు విభజన చేసి ఉండేదని తెలిపారు. సెప్టెంబర్ 17ను బీజేపీ రాజకీయం చేస్తోందని, మత ఘర్షణలు రేపి చలి కాచుకోవాలనే దుర్మార్గ ఆలోచన చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలకు చేతనైతే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రధానిని పిలవా లని సూచించారు. ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతల సినిమా ఆడడం లేదన్నారు.