సంకీర్త్‌ కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ

21 Jul, 2016 16:59 IST|Sakshi
హైదరాబాద్‌ : అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగు విద్యార్ధి సంకీర్త్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం పరామర్శించారు. సుల్తాన్‌ బజార్‌లోని సంకీర్త్ నివాసానికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంకీర్త్ హత్య తనని కలచివేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విషయంపై అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భగా సంకీర్త్‌ తం‍డ్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తనకు కలిగిన పుత్రశోకం ఎవరికీ రాకూడదన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. 
 
 
మరిన్ని వార్తలు