హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో బుధవారం బతుకమ్మ ఆరో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఎంపీ కవిత పాల్గొన్నారు. కవిత బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో క్యాంపు ఆఫీస్ మర్మోగిపోతోంది.