హయత్‌నగర్‌లో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత

11 Aug, 2016 09:50 IST|Sakshi

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం పసుమాములలో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీసీ సంక్షేమ హాస్టల్‌ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో కలుషిత నీరు తాగి పదో తరగతి విద్యార్థి రాకేశ్‌ మృతిచెందాడు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. రాకేష్ తల్లిదండ్రులకు హాస్టల్‌ వార్డెన్‌ సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థి రాకేశ్‌ మృతిచెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హాస్టల్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు