నేడు ఢిల్లీలో సీఎంకు ఉత్తమ రైతు అవార్డు

5 Sep, 2017 01:53 IST|Sakshi
సీఎం తరఫున అవార్డు స్వీకరించనున్న మంత్రి పోచారం  
 
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరఫున గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌–2017 ఉత్తమ రైతు అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఢిల్లీలో అందుకోనున్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. భారత ఆహార వ్యవసాయ మండలి (ఐసీఎఫ్‌ఏ) సీఎం కేసీఆర్‌ను గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపికచేసిన సంగతి తెలిసిందే.

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు ఈ అవార్డు ఇస్తున్నట్టు ఐసీఎఫ్‌ఏ తెలిపింది. 2008 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నామని పేర్కొంది. 
మరిన్ని వార్తలు