24 మంది ఉత్తమ మహిళలు

7 Mar, 2017 04:07 IST|Sakshi
24 మంది ఉత్తమ మహిళలు

మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: విశిష్ట మహిళలకు విశేష గౌరవం దక్కనుంది. 13 రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన 24 మంది ఉత్తమ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఉత్తమ మహిళలకు రూ.లక్ష నగదు బహుమతి, అవార్డులు అందజేసి సత్కరించనుంది.

అవార్డుకు ఎంపికైనవారికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే సమాచారం అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు