భాగ్యనగరిలో ట్రింగ్.. ట్రింగ్

19 Jan, 2016 01:10 IST|Sakshi
భాగ్యనగరిలో ట్రింగ్.. ట్రింగ్

1895లో నగరంలోని బారాదరిలో తొలి టెలిఫోన్‌ను ఏర్పాటు చేశారు. నారాయణ గూడలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించారు. 1910-12  నాటికి ఫోన్‌ల సంఖ్య 321కి చేరింది. రోజుకు వెయ్యి కాల్స్ చేసేవారట. కాలక్రమంలో ఎక్స్ఛేంజ్ పరిధి దాదాపు 740 కిలోమీటర్లకు విస్తరించింది. టెలికం విభాగం నుంచి నిజాం సర్కారుకు రూ. 54,600 ఆదాయం వచ్చేది. టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20 వేలు ఖర్చు పెట్టారు.

>
మరిన్ని వార్తలు