అబద్ధాల కేసీఆర్‌ను జైల్లో పెట్టాలి: భట్టి

26 Aug, 2016 02:30 IST|Sakshi
అబద్ధాల కేసీఆర్‌ను జైల్లో పెట్టాలి: భట్టి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టి, మహారాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఒప్పందం చేసుకున్న సీఎం కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మా ట్లాడుతూ ఎన్నో ఆశలు పెట్టుకుని సీఎంని చేసిన తెలంగాణ ప్రజలను వంచించేలా ఒప్పందం చేసుకుని, కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడుతున్న కేసీఆర్‌ను జైల్లో పెట్టాలన్నారు. సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడేనన్నారు.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కుటుంబ సభ్యుల భూములను కాపాడటం కోసమే తెలంగాణ ప్రయోజనాలనుకేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు. పోలవరంలో 2లక్షల ఎకరాల ముంపు జరుగుతున్నా పట్టించుకోని ఆయన, మహారాష్ట్రలో కేవలం 3వేల ఎకరాల ముంపును కూడా ఒప్పించలేకపోయారన్నారు. బస్తీమే సవాల్ అనడం కేసీఆర్ హోదాకు తగిందికాదన్నారు.

మరిన్ని వార్తలు