హైదరాబాద్: మలక్పేట-దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై యువకులు బైక్ రేస్తో రెచ్చిపోయారు. ఓ బుల్లెట్ వాహనం, మరో ద్విచక్రవాహనంపై కొందరు విద్యార్థులు ట్రిపుల్ రైడింగ్తో రేస్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మరో ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో ఆ వాహనంపై ఉన్న వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయాడు. విద్యార్థులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మలక్పేట పోలీసులు స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించచారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.