నందినగర్: నాలుగు రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్లోని నందినగర్లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.