'ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది'

31 May, 2016 12:33 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహించడం సంతోషంగా ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిగా సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం  సురేష్ ప్రభు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము చేయవలసిందంతా చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు