సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్నచూపని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. డ్వాక్రా మహిళలను టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ డ్వాక్రా మహిళలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. క్యాబినెట్లో మహిళలకు అవకాశం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు.