అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్ 1లోగా చెల్లించాలని మహిళా అధ్యాయన కేంద్రం కోఆర్డినేటర్ కే రామచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 2 నుంచి, తృతీయ సంవత్సరం విద్యార్థులకు మే 9 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.