కేసీఆర్ కుటుంబానికి లడ్డూ అందజేత

10 Sep, 2014 04:20 IST|Sakshi
కేసీఆర్ కుటుంబానికి లడ్డూ అందజేత

సరూర్‌నగర్: వేలం పాటలో రూ.4.5 లక్షలకు దక్కించుకున్న బడంగ్‌పేట లడ్డూను కర్రె కృష్ణ మంగళవారం సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లోని కాళోజీ శతజయంతి సభకు వెళ్లగా ఆయన కుమారుడు ఐటీ శాఖామంత్రి కేటీఆర్ లడ్డూను అందుకున్నారు.  టీఆర్‌ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొత్త మధుసూదన్‌రెడ్డి, కొంతం రోహిత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చప్పిడి రాజిరెడ్డి, అశోక్‌కుమార్, సంతోష్‌కుమార్, సంజీవ, హన్మంతరావు, రాజుచారి, రఘుపతి, మౌలానా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు