27న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం

21 Jul, 2016 04:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపు అంశాలను చర్చించేందుకు నీతి ఆయోగ్ ఈనెల 27న అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు, ఎఫ్‌ఆర్‌బీఎం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య హాజరవనున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించే ఆనవాయితీని నీతి ఆయోగ్ కొనసాగిస్తోంది. సీఎస్ రాజీవ్‌శర్మ గురువారం ఉదయాన్నే ఢిల్లీకి వెళ్లనున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ భేటీలో ఆయన పాల్గొంటారు.

మరిన్ని వార్తలు