శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం

21 Sep, 2017 11:00 IST|Sakshi
రంగారెడ్డి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం రేగింది. హైదరాబాద్‌ నుంచి లక్నో వెళ్తున్న సతీష్‌ కుమార్‌ అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ లభించింది. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లక్నో వెళ్తున్న సతీష్‌ లగేజీలో బుల్లెట్‌ ఉన్నట్లు గుర్తించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సతీష్‌ నగరంలోని ఎల్బీ నగర్‌ వాసిగా గుర్తించారు. బుల్లెట్‌ సైజ్‌ 7.65 ఎమ్‌ఎమ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
మరిన్ని వార్తలు