హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు ఊపందుకున్నాయి. మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ ఆదివారం ఉదయం భేటీయ్యింది.
కొత్త జిల్లాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనపై చర్చించడంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిగణనలోనికి తీసుకుంటుంది. గద్వాలను కొత్త జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. సమావేశం జరుగుతున్న కార్యాలయం ముందు గద్వాల సాధన సమితి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.