నిలిచిన కేబుల్ ప్రసారాలు

7 Jun, 2016 04:13 IST|Sakshi

కేబుల్ ఆపరేటర్ హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బీరంగూడలో కేబుల్ ఆపరేటర్ రమేశ్ హత్యను నిరసిస్తూ కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రసారాలను నిలిపివేసి నిరసన తెలిపారు. కొందరు మాఫియాగా ఏర్పడి ఆపరేటర్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజుగౌడ్, గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు లింగాల హరిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసన విజయవంతమైందని తెలిపారు.  

మరిన్ని వార్తలు