కూల్చివేతను వాయిదా వేసుకోండి: చాడ

5 Nov, 2016 02:51 IST|Sakshi
కూల్చివేతను వాయిదా వేసుకోండి: చాడ

సాక్షి,హైదరాబాద్ : సచివాలయం కూల్చివేత, తరలింపు అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తిచేశారు. దీనిపై పునరాలోచించుకోవాలని శుక్రవారం సీఎంకు రాసిన లేఖలో కోరారు.  ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలిచిపోయి, డబుల్ బెడ్రూం ఇళ్లు మొదలు కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం రూ.50 కోట్లతో ఇప్పటికే నిర్మించుకోవడం, కొత్త సచివాలయానికి రూ.380 కోట్లతో శంకుస్థాపనకు సిద్ధం కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. సీఎంకు విపక్షాలన్నా, విమర్శలన్నా గిట్టట్లేదన్నారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుదలపై దృష్టిపెడితే సమంజసంగా ఉంటుం దని సూచించారు.

>
మరిన్ని వార్తలు