శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన 800 గ్రామలు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూట్కేసుకు ఉన్న కడ్డీలలో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతనిని విచారణ చేపడుతున్నారు.