ఓట్ల తొలగింపు ప్రక్రియపై సీఈసీ దృష్టి

29 Oct, 2015 18:00 IST|Sakshi

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఓట్ల తొలగింపు ప్రక్రియపై రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులిచ్చాయి. పార్టీల ఫిర్యాదుల మేరకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలు చేపట్టింది. దాంతో ఇద్దరు ఎన్నికల సంఘం సభ్యులు గురువారం హైదరాబాద్ చేరుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు నగరంలో వివిధ పార్టీ నేతలను ఎన్నికల సంఘం సభ్యులు కలవనున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు