కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ

19 Jun, 2016 18:01 IST|Sakshi
కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ

హైదరాబాద్: పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటించిన విధి విధానాలనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా అవలంభిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ...పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్కు చురకలంటించారు. ప్రలోభాలపై అధికార పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సాయంపై తెలంగాణ మంత్రలు అబద్ధాలు చెబుతున్నారని దత్తాత్రేయ ఆరోపించారు.

మరిన్ని వార్తలు