'త్వరలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు'

11 Dec, 2016 14:50 IST|Sakshi
'త్వరలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు'

హైదరాబాద్ : దేశంలో ఐదు కోట్ల మందికి త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. బషీర్‌బాగ్ న్యాయకళాశాలలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర కార్మిక మంత్రిగా ఉద్యోగాల కల్పన తన బాధ్యత అని, 2022 నాటికి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు.

>
మరిన్ని వార్తలు