‘జనహిత’ ద్వారా అందరినీ కలుసుకోవాలి

18 Feb, 2017 02:12 IST|Sakshi
‘జనహిత’ ద్వారా అందరినీ కలుసుకోవాలి

కేసీఆర్‌కు చాడ సూచన

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఇప్పటి కైనా తన వైఖరి మార్చుకొని జనహిత కార్యక్రమం ద్వారా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలను కలుసుకోడానికి అవకాశం కల్పిస్తారని సీపీఐ ఆకాంక్షించింది. రెండున్నరేళ్లలో ప్రజలను కలుసు కోడానికి కేసీఆర్‌ నిరాకరించారని.. అయితే తన 63వ జన్మదినం సందర్భంగా ‘జనహిత’కు సీఎం నాంది పలకడాన్ని సీపీఐ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేసీఆర్‌కు సీపీఐ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలస్యంగానైనా ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకు లు, కార్యకర్తలకే ఇప్పటివరకు కేసీఆర్‌ దర్శనం పరిమితమైందన్నారు.

మరిన్ని వార్తలు