వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్

4 Nov, 2016 14:42 IST|Sakshi
హైదరాబాద్: రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శ్రీలత రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు  పోలీసులను ఆశ్రయించింది. 
మరిన్ని వార్తలు