హైదరాబాద్: రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శ్రీలత రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది.