జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి

8 Aug, 2015 15:08 IST|Sakshi

ఆదిలాబాద్(కుంటాల): హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కుంటాల జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడు గుండ్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని తార్నకకు చెందిన ఊటుకూరి చైతన్య(24), స్నేహితులతో కలసి జలపాతాన్ని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.

మరిన్ని వార్తలు