రెండో రోజు కొనసాగుతోన్న సీఎం సమీక్షలు

3 Oct, 2016 15:11 IST|Sakshi
రెండో రోజు కొనసాగుతోన్న సీఎం సమీక్షలు
హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు జిల్లా నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వరంగల్ జిల్లా నేతలతో సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా నేతలు హాజరయ్యారు. ఆదివారం మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. 
మరిన్ని వార్తలు