'నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించం'

21 Dec, 2016 17:42 IST|Sakshi
'నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించం'

హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోమని సీఎం కేసీఆర్ తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీని నిర్వహించేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదన్నారు.  

ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. రూ.16,500 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను కూడా చెల్లించామని సీఎం చెప్పారు.

మరిన్ని వార్తలు