కప్పేసిన మంచు దుప్పటి...

26 Dec, 2015 22:17 IST|Sakshi

- ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
- పలు ప్రాంతాల్లో నాలుగైదు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల
- మరో వారం రోజుల చలిగాలుల తీవ్రత : ఐఎండీ

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల శుక్రవారంతో పోల్చితే శనివారం కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌ఘడ్, బీహార్, పశ్చిమ బెంగ, సిక్కిం, ఒడిశా, మహారాష్ట్రలో మంచు, చలిగాలుల తీవ్రత పెరిగిందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.


కనిష్ట ఉష్ణోగ్రతలు
ప్రాంతం 25వ తేదీ 26వ తేదీ
నందిగామ 18 12
విశాఖపట్నం 24 20
బాపట్ల 20 17
కలింగపట్నం 22 19
కావలి 23 19
మచిలీపట్నం 23 22
నెల్లూరు 23 21
ఒంగోలు 23 20
తెనాలి 23 21
విజయవాడ 21 18
కర్నూలు 22 18
కడప 21 20
నంద్యాల 21 19

మరిన్ని వార్తలు