సనిమా అవార్డులకు కమిటీ...

21 Apr, 2016 04:14 IST|Sakshi
సనిమా అవార్డులకు కమిటీ...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సినిమా అవార్డులకు పేరును ఖరారు చేయటంతో పాటు అందుకు సంబంధించిన మార్గదర్శకాల తయారీకి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.రామ్మోహన్‌రావు, కార్యదర్శి కె.మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, వి.వెంకటరమణారెడ్డి(దిల్ రాజు), ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎన్.శంకర్, సురేశ్ కొండేటిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. జీఏడీ(ఐ అండ్ పీఆర్) కార్యదర్శి నవీన్ మిట్టల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు