చర్లపల్లి జైలులో విద్యార్థులకు నేతల పరామర్శ

25 Mar, 2016 12:31 IST|Sakshi

హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ ప్రొఫెసర్లు, విద్యార్థులను వివిధ పార్టీల నేతలు పలకరించి, మద్దతు పలికారు. శుక్రవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నేత శ్రవణ్‌కుమార్ అరెస్టైన విద్యార్థులను, అధ్యాపకులను పలకరించారు. వీరితో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల కూడా విద్యార్థులకు మద్దతు పలికారు. వీసీ అప్పారావు తిరిగి విధుల్లోకి చేరిన సందర్భంగా నాలుగు రోజుల క్రితం హెచ్‌సీయూలో జరిగిన గొడవలపై కొందరు అధ్యాపకులను, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు