ఫిరాయింపులపై కాంగ్రెస్ ఆందోళన

28 Apr, 2016 03:09 IST|Sakshi

వలసలకు అడ్డుకట్టపై నేడు నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ వీడిపోతుండటంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆందోళన చెందుతోంది. వల సలను నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి ఆ పార్టీ శాసనసభాపక్షం గురువారం అసెంబ్లీలోని కమిటీహాలులో సమావేశం కానుం ది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా  కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిరాయింపులపై సీఎల్పీని ఏఐసీసీ వివరణ అడిగినట్టుగా సమాచారం. దీంతో సీఎల్పీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది.

>
మరిన్ని వార్తలు