హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గ అధికార పార్టీ కార్పోరేటర్లపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. స్థానిక బిల్డర్లను బెదిరించి టీఆర్ఎస్ కార్పోరేటర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం హెచ్చార్సీని ఆశ్రయించారు.