'ధనిక రాష్ట్రమంటూనే పేదల పథకాలకు కోత'

15 Nov, 2016 15:41 IST|Sakshi
'ధనిక రాష్ట్రమంటూనే పేదల పథకాలకు కోత'

హైదరాబాద్ : రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ నీరుగార్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...ధనిక రాష్ట్రమని చెబుతూనే పేదల పథకాలకు కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రాద్రి పవర్ ప్లాంట్ పెనుభారంగా మారిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పాత టెక్నాలజీని ఉపయోగించడం వల్లే కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. సీఎం కేసీఆర్కు ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఉత్తమ్ విమర్శించారు.

మరిన్ని వార్తలు