హైదరాబాద్: కానిస్టేబుల్ పరీక్షలో అవకతవకలకు జరిగాయని ఆరోపిస్తూ.. రాతపరీక్ష రాసిన అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాతపరీక్షలో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వకుండా రిక్రూట్మెంట్ పూర్తి చేయొద్దని డిమాండ్ చేస్తూ.. అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఓపెన్ చాలెంజ్లో రూ.5 వేలు కట్టినా రిప్లే ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.